Tuesday, October 23, 2012

మహిత మూర్తులందరి పాద చరణములకు.

ఈజగతి స్రుష్టికి జీవనలయకారిణి
కారుణ్యమూర్తి కరకమలములలో
కరుణాక్రుతి దాల్చిన సుమసుకుమార
హంస మంజీరాలవంటి ఆ చిగురుపాదాలు

దివినుండి భువికి దిగిరానని మారాంచేసిన
గారాలపట్టి దేవతమూర్తి సధ్రుశ్యంగా
నర్తించే పాద సవ్వడుల నాద మంజీర
మంగళ రవముల మెరుపులభావనలకు

తోడైన ఆనందభైరవి రాగలహరిలో
వనదేవతలు పలవరింతులుకాగా
అవనిమాత మదిలో పులకరింతల
శ్రావణమేఘాలు వర్షించగా

నదీమాతలుల్ల మాత్రుహ్రుదయాల్లో
మమతల గంగాప్రవాహములుప్పొంగవా
ఇడుములలోనున్నవారిని అక్కునచేర్చుకుని
స్వాంతన ప్రవచనాలతో సేదదీర్చే 

సేవామూర్తులందరి రూపాల్లో 
ప్రతిఫలించే భారతరత్నగా 
ఘనతిపొందినా విశ్వమాతగా 
విఖ్యాతినొందినా

అంతరిక్షయానంలో
ఆత్మార్పణజేసి
మానవజాతి వర్దిల్లడానికి 
వారధిగా నిలిచినారు

ఈధరణీపై వెలసిన 
మహనీయ,మాననీయ
మహిత మూర్తులారా అందుకోండి 
ఈ జగతి నీరాజనాలు.





రచనాకాలం.09.03.2012

No comments:

Post a Comment