Monday, October 22, 2012

పోటితో బంధమైన యుగళగీతం.



కోవెలనే కమనీయ కళారంగవేదిక కాగా 
దక్షిణ భారత దేశ సుస్వరనాగరాజనుడు
మురళీధరుడి పొన్నపూల సన్నాయిరాగం 
మొహనాంగి తన్మయ ఆరంగేట్రానికి సాగిలబడి


ఏజన్మలోనైన తాను దాసానుదాసుడనన్నదీ
కోయిల నిర్ణేతగానుండి జరిగిన చివరి అంకంలోని
యుగళ గీతాలాపనలో తడబడిన పాదములతో
పల్లవి అనుపల్లవులు తోడిరాగంతో జతకట్టినవీ


వలపును కన్నతల్లి మేఘం కురిసింది తొలకరిగా
అల్లుకున్న ప్రేమలతకు అడ్డా అండా మల్లెపందిరే
మాఘంలోనే మంగళ తోరణాలతో వాయిద్యాలతో
వేద మంత్రాల సాక్షిగా ఒక్కటవ్వనున్నఆజంట


మురిపాలతోడ పాడుకునే గీతాల చందనమిదే.
(1) "నువ్వు నేను వలచితిమి 


      నందనమే ఎదురుగా చూసితిమి"
(2)" ఇదిగో నవలోకం వెలసే మనకోసం ".





రచనాకాలం.: 04/09/2012. 

No comments:

Post a Comment